తాగునీరు కలుషితం | - | Sakshi
Sakshi News home page

తాగునీరు కలుషితం

Aug 6 2025 8:17 AM | Updated on Aug 6 2025 8:25 AM

తాగునీరు కలుషితం

తాగునీరు కలుషితం

తాండూరు టౌన్‌: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్వహించిన తవ్వకాలతో తాగునీటి పైప్‌లైన్‌ పగిలిపోయింది. దీంతో నీరు కలుషితమవుతోంది. తాండూరు – చించోళి మార్గంలో సెయింట్‌ మార్క్స్‌ పాఠశాల సమీపంలో మిషన్‌ భగీరథ పైప్‌ పగిలిపోవడంతో నీరు బయటకు వచ్చి మడుగును తలపిస్తోంది. లీకేజీ నీటిలో పందులు పొర్లాడుతున్నాయి. కుక్కలు, పశువులు దాహం తీర్చుకుంటున్నాయి. ఆ నీరే ఇంకి పైపుల్లో కలిసి ఇళ్లకు సరఫరా అవుతోంది. నెల రోజులుగా ఇలాగే జరుగుతోందని అయినా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement