ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష

Aug 4 2025 5:28 AM | Updated on Aug 4 2025 5:28 AM

ప్రశాంతంగా  నీట్‌ పీజీ పరీక్ష

ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష

ఇబ్రహీంపట్నం రూరల్‌: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పీజీ నీట్‌ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన పరీక్షకు ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ, శ్రీఇందు, ఏవీఎన్‌, శ్రీఇందు, గురునానక్‌ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆదిబట్ల మున్సిపల్‌ పరిధిలోని రాందాస్‌పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పరీక్ష కోసం 110 మందిని కేటాయించారు. పరీక్ష సమయానికి ముందుగానే చేరుకున్న గాంధీ మెడికల్‌ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్‌ నితిన్‌ పొరపాటున ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ మర్చిపోయాడు. పరీక్ష సమయం దగ్గరపడుతుండడం.. సమీపంలో ఎక్కడా జిరాక్స్‌ కేంద్రాలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్‌రెడ్డి తన కారు ఇచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు పంపించి ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ జిరాక్స్‌ తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో నితిన్‌, ఆయన తల్లిదండ్రులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement