సర్కార్‌ బడుల బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ బడుల బలోపేతానికి కృషి

Jul 8 2025 7:17 AM | Updated on Jul 8 2025 7:17 AM

సర్కార్‌ బడుల బలోపేతానికి కృషి

సర్కార్‌ బడుల బలోపేతానికి కృషి

పూడూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కంకల్‌ ప్రభుత్వ పాఠశాలకు జిల్లా అధికార ప్రతినిధి కొండాల రవీందర్‌ రూ.30 వేలు వెచ్చించి సీసీ కెమెరాలను అందజేశారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. ఉన్న ఊరుకు, చదువుకున్న పాఠశాలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరప్ప 200 రకాల పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు శ్రీశైలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణాచారి, నాయకులు మాణిక్యం, రవి, నర్సింలు, నవీన్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement