రాపూరు: నాణ్యమైన, మన్నికై న భవనాల నిర్మాణం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారైన భారతి సిమెంట్స్ను ఎంచుకోవాలని ఆ సంస్థ మార్కెటింగ్ ఆఫీసర్ బాబ్జాన్ సూచించారు. రాపూరులోని శివాని ఫర్టిలైజర్స్ సహకారం, భారతి సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయావుతుందని తెలిపారు. కట్టడాలు పూర్తి నాణ్యతతో దీర్ఘకాలం మనగలిగేందుకు దోహదపడుతుందని చెప్పారు. తమ సిమెంట్ తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలనే ఎంచుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం హాజరైన మేసీ్త్రలు, కార్మికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించి, బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో శివాని ఫర్టిలైజర్స్ అధినేత ఏటూరి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


