‘బాబు నీ బుద్ధి మారదా?’ | - | Sakshi
Sakshi News home page

‘బాబు నీ బుద్ధి మారదా?’

Dec 19 2025 8:33 AM | Updated on Dec 19 2025 8:33 AM

‘బాబు నీ బుద్ధి మారదా?’

‘బాబు నీ బుద్ధి మారదా?’

● 14 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్‌ కళాశాలైనా తెచ్చావా బాబు? ● సీపీఐ ఆధ్వర్యంలో మహా ధర్నా ● ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్‌ ఎకరం భూమి రూ.100 చొప్పున ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి చంద్రబాబుకు మనస్సు ఎలా వచ్చిందో తెలపాన్నారు. ● సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్‌ మెడికల్‌ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందో చంద్రబాబు , కుమారుడు లోకేష్‌ ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. ● ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ.. డబ్బులు ఉన్నోడికే డాక్టర్‌ సీటు అంటూ పాటల రూపంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై వివరించారు. పేదల ఓట్లతో గద్దెనెక్కి పేదలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబుకు ఉసురు తగులుతుందంటూ హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు సీహెచ్‌ ప్రభాకర్‌, రాధాకృష్ణ, జనమాల గురవయ్య , ఉదయ్‌ కుమార్‌, నదియా నగర, ఎన్‌డి రవి, పద్మనాభ రెడ్డి, మహేంద్ర, శ్రీరాములు,్‌ శివ, రాజా, ప్రవీణ్‌ కుమార్‌ హరికృష్ణ, మంజుల, చారులత, విజయ లక్ష్మి, ప్రమీల, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వామపక్షనేతలు

తిరుపతి అర్బన్‌ : సీఎం చంద్రబాబు బుద్ధిలో ఏ మాత్రం మార్పు రాలేదని.. ఆయనది ఎప్పుడూ కార్పొరేట్‌ ఆలోచనేనని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మండిపడ్డారు. సీపీఐతోపాటు ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్‌ వద్ద గురువారం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయడంపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ గేటు నుంచి లోనికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పి. మురళి మాట్లాడుతూ.. 17 మెడికల్‌ కళాశాలలు గత ప్రభుత్వం తీసుకొస్తే...చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటుగా ఉందని మండిపడ్డారు.55 శాతం సీట్లు.. ఒక్కో సీటు కోటికి అమ్ముకోవడం... 45శాతం సీట్లు కన్వీనర్‌ కోటలో ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ 100 శాతం సీట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో మెరిట్‌ విద్యార్థులకు అందిస్తామని చెప్పి.. ప్రస్తుతం మాట తప్పినందుకు తక్షణమే మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement