శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Nov 12 2025 5:41 AM | Updated on Nov 12 2025 5:41 AM

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

● 17 నుంచి 25 వరకు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ● 17 ధ్వజారోహణం (ధనుర్‌ లగ్నం) చిన్నశేషవాహనం ● 18 పెద్దశేషవాహనం, రాత్రి హంస వాహనం ● 19 ముత్యపుపందిరి వాహనం రాత్రి, సింహవాహనం ● 20 కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం ● 21 పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనం ● 22 సర్వభూపాలవాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడవాహనం ● 23 సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం ● 24 రథోత్సవం, అశ్వ వాహనం ● 25న ఉదయం పంచమీ తీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ● 26న అమ్మవారికి పుష్పయాగ కార్యక్రమం

చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

వాహన సేవల వివరాలు

ఈనెల 17 నుంచి 25 వరకు జరగనున్న శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25 వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement