సమ్మెకు వైద్యులు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు వైద్యులు సన్నద్ధం

Sep 24 2025 4:51 AM | Updated on Sep 24 2025 4:51 AM

సమ్మె

సమ్మెకు వైద్యులు సన్నద్ధం

● పీహెచ్‌సీ వైద్యులకు కచ్చితమైన పనిగంటలు కేటాయింపు ● స్థిరమైన వారాంతపు సెలవు ఇవ్వడం ● డాక్టర్లకు జాబ్‌ చార్ట్‌ కేటాయింపు ● పీహెచ్‌సీలను అనధికారిక వ్యక్తుల తనిఖీలను తగ్గించడం ● తగ్గినంత మేరకు స్టాప్‌ నర్సుల కేటాయింపు ● ఇన్‌సర్వీస్‌ పీజీ కోటాను పునరుద్ధంరించడం ● టైమ్‌బౌండ్‌ ప్రమోషన్లు అమలు చేయడం ● గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు బేసిక్‌ పే 50శాతం, ట్రైబల్‌ అలవెన్స్‌ ● నోషనల్‌ ఇంక్రిమెంట్స్‌ మంజూరు ● చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్‌కు వైద్యులకు 5వేలు అలవెన్స్‌.2

25న కార్యాచరణ ప్రకటిస్తాం కలెక్టర్‌కు, డీఎంహెచ్‌వోకు వినతి పత్రాన్ని ఇచ్చిన పీహెచ్‌సీ వైద్యులు

తిరుపతి అర్బన్‌ : ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. సమ్మెకు వెళుతున్నాం అంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యులు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు తెలియజేశారు. మంగళవారం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. తమ పోరాటం ప్రజలపై కాదని...ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాత్రమేనని వెల్లడించారు. ఈ అంశాన్ని ప్రజలు కచ్చితంగా గుర్తించాలని కోరారు. గురువారం సమ్మెకు సంబంధించి కార్యాచరణ ప్రకటించి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌కు సమ్మెకు సంబంధించిన వినతిపత్రాన్ని వైద్యులు అందించారు.

ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్లు ఇవే..

సమ్మెకు వైద్యులు సన్నద్ధం1
1/1

సమ్మెకు వైద్యులు సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement