పకడ్బందీగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 10 2025 12:17 AM | Updated on May 10 2025 12:17 AM

పకడ్బందీగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

పకడ్బందీగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

తిరుపతి అర్బన్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన పరీక్షల నిర్వాహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు 64 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 30,182 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement