లారీని ఢీకొన్న బస్సు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న బస్సు

Mar 24 2025 6:47 AM | Updated on Mar 24 2025 9:23 AM

– 15 మంది గాయాలు

వెంకటగిరి రూరల్‌ : రేణిగుంట సెజ్‌లోని కార్బన్‌ లియోలింక్‌ కంపెనీకి చెందిన బస్సు వెంకటగిరి పరిసర ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులతో వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఆదివారం వేకువజామున శ్రీకాళహస్తి రూరల్‌ మండలం ఎంపేడు గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నట్లు . శ్రీకాళహస్తి రూరల్‌ ఎస్‌ఐ నరసింహారావు వెల్లడించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ మునేంద్రతోపాటు, రాపూరుకి చెందిన యశోద, వెంకటగిరికి చెందిన కుషల్‌, గొట్లగుంటకు చెందిన ప్రసాద్‌, లింగసముద్రానికి చెందిన శివాజీతోపాటు మొత్తం 15 మంది గాయపడ్డారు. రాయచోటికి చెందిన లారీ క్లీనర్‌ రాజు సైతం తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రులను 108 వాహనంలో వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మెరుగైన చిక్సి కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement