![వైభవం](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24cdr101_mr.jpg.webp?itok=JPHZNzVC)
చంద్రగిరి(తిరుచానూరు): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. అందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. కార్యక్రమంలో జేఈఓ గౌతమి, డిప్యూటీ ఈఓ గోవింద రాజన్, అర్చకుడు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు గణేష్, సుభాష్ పాల్గొన్నారు.
శోభాయమానంగా ముగిసిన సంబరాలు
![వైభవం.. వసంతోత్సవం](/sites/default/files/gallery_images/2024/05/25/24cdr100_mr.jpg)
వైభవం.. వసంతోత్సవం
![వైభవం.. వసంతోత్సవం](/sites/default/files/gallery_images/2024/05/25/24cdr102_mr.jpg)
వైభవం.. వసంతోత్సవం