రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా

Telangana SEC Parthasarathi Tests Positive For COVID-19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్‌గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్పజ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. కాగా ఈ నెల 28న నిమ్స్‌లో ఆయన కోవిడ్‌ టీకా తొలిడోసు వేసుకున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. అందులో భాగంగా ఈ నెల 7న ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి పార్థసారథి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top