విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి | Tandoor Medical Student Drowned In America | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌ జిల్లాలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి

Nov 28 2022 1:15 AM | Updated on Nov 28 2022 7:40 AM

Tandoor Medical Student Drowned In America - Sakshi

శివదత్తు  

తాండూరు: అమెరికాలోని మిస్సౌరిలో వైద్యవిద్య అ భ్యసిస్తున్న తాండూరు విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన అపెక్స్‌ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25)  వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు.

శివదత్తు సెయింట్‌ లూయిస్‌ వర్సిటీలో డెంటల్‌ ఎంఎస్‌ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితుడితో కలిసి  ఓజార్క్‌ సరస్సుకు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ  మునిగిపోయారు.  విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
(చదవండి: దంత ఆరోగ్యంపై తలసరి ఖర్చు 4 రూపాయలే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement