
ప్రైవేట్ కాలేజీల సమ్మె గుర్చించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని విచ్చిన్నం చేసింది.ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని మాపై బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టివెళ్ళింది. గత ప్రభుత్వం మాపై నెట్టిన భారాన్ని నెమ్మదిగా పరిష్కరిస్తున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ టోకెన్ల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.భవిషత్ లో మిగతా పెండింగ్ బిల్లులను దశల వారీగా క్లియర్ చేస్తాం. ప్రభుత్వ నిర్ణయానికి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పై కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
కాలేజీలు, అధికారుల ఆధ్వర్యంలో కమిటీ రెండు మూడు రోజుల్లో వేయనునాం
రమేష్ బాబు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మెన్
సమ్మెను విరమించుకుంటున్నాం. మా డిమాండ్ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకున్నందుకు ధన్యవాదాలు.