
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు తన శైలి ఒకటేనని మరోసారి నిరూపించుకున్నారు మంత్రి సీతక్క. గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రజలు కష్టాలు పడ్డ సమయంలో సీతక్క ఉదారతను చాటుకున్న సంగతి మనకందరికీ సుపరిచితమే. అయితే అప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉండి, మంత్రి పదవిలో ఉన్న సీతక్క.. ఓ వాహనదారుడి పట్ల మానవత్వం చాటుకున్నారు.
హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీద ఓ వాహనదారుడు ఫిట్స్ వచ్చి పడిపోతే, అటువైపుగా వెళ్తున్న సీతక్క దానిని గమనించారు. వెంటనే ఆ వాహనదారుడి వద్దకు వెళ్లి తాళం చెవిని చేతిలో పెట్టారు. అంతేకాకుండా ఆ వాహనదారుడు తేరుకునే దాకా అక్కడే ఉండి అతన్ని పర్యవేక్షించారు. అతను తేరుకున్న తర్వాత ధైర్యం చెప్పి ఆస్పత్రికి పంపించారు సీతక్క.