బంజారాహిల్స్‌: భర్తతో గొడవపడి.. సోదరి ఇంటికి వెళ్తున్నానని చెప్పి.. | Married Woman With Two Childrens Goes to Missing In | Sakshi
Sakshi News home page

Banjara Hills: భర్తతో గొడవపడి.. సోదరి ఇంటికి వెళ్తున్నానని చెప్పి..

Mar 17 2022 10:36 AM | Updated on Mar 17 2022 12:54 PM

Married Woman With Two Childrens Goes to Missing In - Sakshi

ప్రియాంక(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: భర్తతో గొడవ పడి ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన ఘటన భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ప్రియాంక(35), శామ్యూల్‌ దంపతులు. వీరికి రిచల్‌ శరణ్‌(6), అభిషేక్‌పాల్‌(3) సంతానం. ప్రియాంక ఇటీవల భర్తతో గొడవపడి పాతబస్తీ లలితాబాగ్‌లో నివాసముండే సోదరి ప్రసన్న కుమారి ఇంటికి ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లింది.

9వ తేదీన సాయంత్రం ఇద్దరు పిల్లలతో కలిసి బయటకి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement