కుప్పకూలిన గ్యాలరీ స్టాండ్‌.. 100 మందికి గాయాలు

Kabaddi Championship Gallery Collapse 100 Injured Suryapet - Sakshi

సాక్షి, సూర్యాపేట: జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆటను తిలకించే క్రమంలో ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ స్టాండ్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రి​కి తరలించారు.

ఇక ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. గ్యాలరీ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది అక్కడ కూర్చోవడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా 47వ జూనియర్‌ జాతీయ కబడ్డీ చాంపియన్‌ షిప్‌- 2021ను సోమవారం ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top