రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో భార్యాపిల్లలపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి. ఆమనగల్ మండలం పులిగోని పల్లి తండాలో ఈ దారుణం జరిగింది. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు ఆ వ్యక్తి.
బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య, కుమారుడు, కూతుర్ని కత్తితో పొడిచాడు. దీంతో అతడి భార్య, కుమారుడు మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఆ బాలికకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఈ బాణావత్ పాల్పడ్డ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య పేరు కవిత, కుమారుడి పేరు హర్ష, కూతురి పేరు ప్రణితగా గుర్తించారు.


