
సాక్షి, హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థల వరుస సోదాలు, తనిఖీలతో నగరం మరొకసారి ఉలిక్కిపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నగరంలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తోంది.
ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో గురువారం ఉదయం ఈడీ అధికారుల తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బూరుగు రమేష్తో పాటు ఆయన తనయుడు విక్రాంత్ ఇంట్లోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఆల్వాల్, మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందాల్సి ఉంది.