ధరణి పోర్టల్‌పై కేసీఆర్‌ సమీక్ష.. | CM KCR Review On Dharani Portal | Sakshi
Sakshi News home page

ధరణి పోర్టల్‌పై కేసీఆర్‌ సమీక్ష..

Sep 22 2020 9:58 PM | Updated on Sep 22 2020 10:05 PM

CM KCR Review On Dharani Portal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్షించారు. 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల వివరాలు నమోదు చేయాలని కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటి వరకు నమోదు కాని వాటిని కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. అయితే 100శాతం ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఆన్‌లైన్ చేయాల్సిందేనని కేసీఆర్‌ తెలిపారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement