బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్‌

Chikoti Praveen Kumar Met with BJP MLA Raja Singh at Dhoolpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చికోటి ప్రవీణ్‌ కుమార్‌ కలిశారు. శుక్రవారం ధూల్‌పేట్‌లోని రాజాసింగ్‌ నివాసానికి వెళ్లిన ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందూత్వ వాదిగా మాత్రమే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలవడానికి వచ్చానన్నారు. 

హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానని తెలిపారు. తనకు ఏ పార్టీలతో కూడా ఎలాంటి సంబంధంలేదన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఆలోచన కూడా లేదన్నారు. రాజాసింగ్‌ హిందూ టైగర్‌ కాబట్టే ఆయన కలవడానికి వచ్చానని చికోటి ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

చదవండి: (నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top