Case Filed Against Jangaon MLA Muthireddy Yadagiri Reddy In Uppal Police Station - Sakshi
Sakshi News home page

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె

Published Tue, May 9 2023 10:38 AM

Case Filed Against Jangaon MLA Muthireddy Yadagiri Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన కూతురు తుల్జాభవని రెడ్డి ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది.  159 గజాల నాచారం ల్యాండ్‌ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్‌కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ముత్తిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయనపై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w  34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదయ్యాయి.
చదవండి: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌ యువతి మృతి

Advertisement
Advertisement