సాక్షి రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన ఇబ్రహీం పట్నం మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకంది. ఓటింగ్ పెట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చేతులు ఎత్తే విధానం కాకుండా ఓటింగ్ పెట్టాలని కౌంటింగ్ హాలులోని ఫర్నిచర్ ఎత్తిపడేశారు. దీంతో పోలీసులు వారిని అదుపుచేసే యత్నం చేశారు.


