సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. సైఫాబాద్ పీఎస్లో కేటీఆర్ పీఏ, పీఆర్వో విచారణ సమయంలో దుండగులు చొరబడ్డారని మాస్క్లతో వచ్చి వారిని బెదిరించారని పిటిషన్లో తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు స్పందించింది. ఈ అంశమై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు రక్షణ కల్పించాలని తెలిపింది.


