Hyd: ఈసారి లక్షా 40 వేల గణేష్‌ మండపాలు | Bhagyanagar Ganesh Utsav Samithi On Ganesh Celebrations | Sakshi
Sakshi News home page

Hyd: ఈసారి లక్షా 40 వేల గణేష్‌ మండపాలు

Sep 1 2026 8:36 PM | Updated on Sep 1 2026 8:48 PM

Bhagyanagar Ganesh Utsav Samithi On Ganesh Celebrations

హైదరాబాద్‌:  ఈసారి భాగ్య నగర పరిధిలో లక్షా నలభై వేల గణేష్‌ మండపాల సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాటి నిమజ్జనాలకు అవసరమయ్యే ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపింది. బడ్జెట్ కేటాయిపులో ప్రభుత్వం స్పీడ్ పెంచాలని మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని, ఎప్పటిలాగే అన్నీ చెరువులు, వినాయక సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుందని  బాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావి నూతుల శశిధర్ సాక్షి టీవీకి తెలిపారు. 

‘అధికారుల తప్పుడు నివేదిక కారణంగా హైకోర్టు వినాయక సాగర్‌పై స్టే ఇచ్చింది. ఎక్కడ వినాయక నిమజ్జనం వల్ల పొల్యూషన్ జరిగినట్లు సరైన ఆధారాలు లేవు. కావాలనే కొందరు అధికారులు హిందూ పండుగలను ఆంక్షలు పెట్టాలని చూస్తున్నారు. కాప్రా చెరువుతో పాటు హైడ్రా డెవలప్ చేసిన అన్నీ చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. 

అడ్డుకోవడానికి హైడ్రాకు ఎలాంటి అధికారం లేదు.  చెరువులకు ఓనర్లు ప్రజలు.. అధికారులు, నాయకులు కాదు. చెరువుల్లో నిమజ్జనం చేయడం మా సంప్రదాయం. అందుకే అన్నీ చెరువుల్లో నిమజ్జనం కొనసాగిస్తాం. అడ్డుకోవాలని చూస్తే.. పరిణామాలు మరోలా ఉంటాయి’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:
భారీ పెరిగిన గణేష్‌ విగ్రహాల ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement