
కొంగరకలాన్లో విషాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో విధులు నిర్వహిస్తున్న
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్లో విషాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రౌండ్ఫ్లోర్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల కాగా, 2018 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.