రేపటి నుంచి ఆసరా పింఛన్లకు దరఖాస్తులు   | Applications For Online Aasara Pension Scheme In Telangana | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఆసరా పింఛన్లకు దరఖాస్తులు  

Oct 10 2021 2:35 AM | Updated on Oct 10 2021 2:35 AM

Applications For Online Aasara Pension Scheme In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ల’కు సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ‘మీ’సేవా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. వృద్ధాప్య పించన్ల వయసును 57ఏళ్లకు తగ్గించినా చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారని పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో అర్హులైన వారందరికీ ఈ పింఛన్లు అందుతాయని సీఎం వారికి హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎస్‌... దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులైన పీఆర్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, టీఎస్‌టీఎస్‌ ఎండీ జీటీ వెంకటేశ్వర్‌రావులను ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement