తెలంగాణలో కొత్తగా 1102 కరోనా కేసులు | 1102 More New Coronavirus Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1102 కరోనా కేసులు

Aug 16 2020 10:24 AM | Updated on Aug 16 2020 2:48 PM

1102 More New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 1102 క‌రోనా కేసులు న‌మోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 91,361కు చేరింది. కరోనాతో కొత్తగా తొమ్మిది మంది మృతి చెందగా..  ఇప్పటివరకు 693 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనాతో 1930 మంది కోలుకోగా.. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 68,126గా ఉంది.  ప్రస్తుతం రాష్ట్రంలో 22,542 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 234 కేసులు, క‌రీంనగ‌ర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 చొప్పున‌ కేసులు ఉన్నాయి. (దేశంలో 50వేలకు చేరువలో మరణాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement