కొరుక్కుపేట: వరల్డ్ వెజ్ కౌన్సిల్ చైన్నె– 2026 సంవత్సరానికి కొత్త కార్యవర్గ బందాన్ని ప్రకటించింది. ఇందులో అంతర్జాతీయ అధ్యక్షుడిగా వైట్ ఫైర్ డైమండ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ ఎండీ ఎస్. మహావీర్ చంద్ బోత్రా, అంతర్జాతీయ కార్యదర్శి డైరెక్టర్లుగా దేవినారాయణ్, ఎక్స్పోర్టర్స్ ప్రయివేటు లిమిటెడ్ ఎండీ సుధాకర్ నారాయణస్వామి నియమితులయ్యారు. అంతర్జాతీయ కోశాధికారి అండ్ డైరెక్టర్గా బృందావన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, చైన్నె సీఈఓ ఆర్. మురళీరావు, వ్యవస్థాపకుడు అంతర్జాతీయ అధ్యక్షుడు అండ్ డైరెక్టర్గా దుగర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైన్నె చైర్మన్ ఎన్. తారాచంద్ దుగర్ నియమితులైనట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


