ఎదురు చూపుల్లో..! | - | Sakshi
Sakshi News home page

ఎదురు చూపుల్లో..!

Mar 29 2026 7:14 AM | Updated on Mar 29 2026 7:14 AM

తమిళసినిమా: అవకాశాలను అందిపుచ్చుకుని నటిస్తున్నా.. నటి కృతిశెట్టిని విజయాలు మాత్రం వరించడం లేదు. అసలు ఈ మంగుళూరు భామ తెలుగులో నటించిన ఉప్పెన చిత్రం సంచలన విజయం సాధిస్తుందని, ఎవరు ఊహించలేదు. తొలి చిత్రమే మంచి పేరు తెచ్చిపెట్టడంతో తన నట కెరీర్‌ వెలిగిపోతుందని కృతిశెట్టి తెగ సంబర పడింది. అనుకున్నట్లు గానే వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి రెండు హిట్లు కూడా ఉన్నాయి. దీనికి తోడు మలయాళం, తమిళం భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇంకేముంది దక్షిణాదిలో వేయవచ్చు అని కలలు కని ఉండవచ్చు ఈ అమ్మడు. తమిళంలోనూ కార్తీ, రవి మోహన్‌, ప్రదీప్‌ రంగనాథన్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అయితే రవి మోహన్‌ సరసన నటించిన జీనీ చిత్రం ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉంది. ఇక కార్తీతో జత కట్టిన వా వాథ్దియార్‌ చిత్రం ఈ మధ్యనే విడుదలై పూర్తిగా నిరాశ పరిచింది. ఇక మిగిలింది ప్రదీప్‌ రంగనాథన్‌కు జంటగా నటించిన ఎల్‌ ఐకే (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ) వరుసగా విజయాలను అందుకుంటున్న ప్రదీప్‌ రంగనాథన్‌ హిరోగా నటించిన చిత్రం కాబట్టి సక్సెస్‌ గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు. అయితే నటి నయనతార రౌడీ పిక్చర్స్‌ సంస్థ, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్‌లోనే విడుదల కావలసింది. అదే సమయంలో ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటించిన డ్యూడ్‌ చిత్రం విడుదల కావడంతో ఎల్‌ఐకే చిత్రం విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి. ఆ తరువాత పలుమార్లు ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్‌ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరో సారి వాయిదా పడుతున్నట్లు తాజా సమాచారం. ఎల్‌ఐకే చిత్రాన్ని ఏప్రిల్‌ 2వ వారంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కృతిశెట్టి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం వాయిదా మీద వాయిదా పాడటం ఆమెకు నిరాశ పరిచే విషయమేమీ అవుతుంది. ఇలా ఎదురు చూపులతో ఉన్న కతి శెట్టికి గుడ్డిలో మెల్ల అన్నట్లుగా త్వరలో తెలుగులో ఒక క్రేజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement