క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 29 2026 7:14 AM | Updated on Mar 29 2026 7:14 AM

జనరేటర్‌ ఇంజిన్‌లో తల ఇరుక్కుని విద్యార్థిని మృతి దాచి పెట్టిన 83 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం ● ఒకరి అరెస్టు చైన్నెలో బీజీఐఎస్‌ గ్రాంఢ్‌ ఫైనల్స్‌ నామ్‌ తమిళర్‌ పార్టీ నాయుకుడిపై కేసు నమోదు అత్యాచారం కేసులో యువకుడికి ఏడేళ్ల జైలు ●చెంగల్పట్టు కోర్టు తీర్పు

అన్నానగర్‌: తంజావూరు సమీపంలోని కండియూర్‌ ప్రాంతానికి చెందిన రాజీవ్‌ గాంధీ కుమార్తె రషీదా (10). ఈమె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆ ప్రాంతంలోని మారియమ్మన్‌ ఆలయంలో పుష్పగుచ్ఛం సమర్పించే కార్యక్రమం సందర్భంగా, శుక్రవారం ఓ సరుకు రవాణా వాహనంలో రోడ్డుపై ఊరేగింపు జరిగింది. రషీదా ఆ సరుకు రవాణా వాహనంలో కూర్చుని ఉంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ రక్షిత తల ఆ సరుకు రవాణా వాహనం యొక్క జనరేటర్‌ ఇంజనన్‌లో ఇరుక్కుపోయింది. ఆమె తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే విషాదకరంగా మరణించింది. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

అన్నానగర్‌: పొల్లాచి సమీపంలోని కాట్టంపట్టిలో గ్యాస్‌ సిలిండర్లను నిల్వ చేసి, బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని పౌర సరఫరాల నేర పరిశోధన శాఖ పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో శనివారం అక్కడ జరిపిన సోదాల్లో సదాశివం అనే వ్యక్తి ఎలాంటి అనుమతి, భద్రతా సదుపాయాలు లేకుండా 83 గ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు రుజువైంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి సదాశివంను అరెస్టు చేశారు. అదనంగా సిలిండర్ల స్మగ్లింగ్‌కు ఉపయోగించిన 2 కార్గో వాహనాలను కూడా సీజ్‌ చేశారు.

సాక్షి, చైన్నె: భారతదేశంలోనే అతిపెద్ద ఈ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా సిరీస్‌(బీజీఐఎస్‌) 2026 గ్రాండ్‌ ఫైనల్స్‌ చైన్నె ట్రేడ్‌ సెంటర్‌ వేదికగా ప్రారంభమైంది. 16 అత్యుత్తమ జట్లు రూ. 4 కోట్ల భారీ బహుమతి కోసం పోటీపడుతున్నాయి. తొలి రోజు ఉత్కంఠ భరితంగా పోరు జరిగింది. ఎరాంగిల్‌ ,మిరామార్‌, మ్యాపులలో మొత్తం ఆరు మ్యాచ్‌లను తొలి రోజు నిర్వహించారు. స్టేడియం నిండా తరలివచ్చిన వేలాది మంది అభిమానుల కేకల మధ్య జట్లు తమ వ్యూహా లతో తలపడ్డాయి. తమిళనాడుకు చెందిన జట్లు సైతం చైన్నె గడ్డపై ఆడుతుండటం విశేషం.ఇండియా ఈ–స్పోర్ట్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ కరణ్‌ పాఠక్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ఇది ఒక టోర్నమెంట్‌ మాత్రమే కాదని, ఇది భారతదేశం నిర్మించుకుంటున్న ఈ– స్పోర్ట్స్‌ సంస్కృతికి నిదర్శనంగా వ్యాఖ్యలు చేశారు. గేమర్స్‌ భాగస్వామ్యంతో ప్రైజ్‌ అదనంగా రూ.2 కోట్లు పెరగడం, తమ యూట్యూబ్‌ ఛానెల్‌కు 20 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉండటం ఈ క్రీడపై ఉన్న క్రేజ్‌ను చాటుతోందన్నారు.

కొరుక్కుపేట: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి జెండా స్తంభాలు ఏర్పాటు చేసిన కేసులో నామ్‌ తమిళర్‌ కచ్చి జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ప్రేమ్‌నాథ్‌ నామ్‌ తమిళర్‌ పార్టీ తరపున రామనాథపురం జిల్లాలోని తిరువదన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పరిచయ సభ శుక్రవారం జరిగింది. కానీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పట్టణమంతటా జెండా స్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నామ్‌ తమిళర్‌ కచ్చి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు.

తిరువొత్తియూరు: పెళ్లి చేసుకుంటానంటూ యువతిపై అత్యాచారం చేసిన యువకుడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించి చెంగల్పట్టు మహిళా న్యాయస్థానం తీర్పునిచ్చింది. మధురాంతకం సమీపంలో ఉన్న అడయాలం గ్రామానికి చెందిన వీరరాఘవన్‌ కుమారుడు మోహన్‌. అతను ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆశపెట్టి మోసం చేసి అత్యాచారం చేశాడని ఫిర్యాదు ర్యాదులు వచ్చాయి. ఈ కేసు తుది విచారణ చెంగల్పట్టు మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి ఎళిల్‌ అరసి సమక్షంలో జరిగింది. మోహన్‌పై నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 3,000 జరిమానా విధించి తీర్పునిచ్చారు.

వృద్ధుడి ఆత్మహత్య

తిరువొత్తియూరు: వంతెన పైనుంచి దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోయంబత్తూర్‌కు చెందిన వేలుసామి(70) సిద్ధాపురంలో ట్రస్టు నడుపుతున్నారు. అలాగే సామాజిక కార్యకర్తగానూ పనిచేస్తున్నారు. ఇతను శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్‌లో బయలుదేరి ఫ్లైఓవర్‌పై బైక్‌ ఆపాడు. వంతెన పైనుంచి కిందకు దూకాడు. ఈఘటనలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అతన్ని పోలీసులు కోయంబత్తూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కట్టూర్‌ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement