● రీజెన్‌ –2025 | - | Sakshi
Sakshi News home page

● రీజెన్‌ –2025

Aug 3 2025 3:20 AM | Updated on Aug 3 2025 3:20 AM

● రీజెన్‌ –2025

● రీజెన్‌ –2025

చైన్నె వేదికగా ప్లేట్‌ లెట్‌ –రిచ్‌ ప్లాస్మా థెరఫీ కోసం మార్గాదర్శకాల ఆవిష్కరణ లక్ష్యంగా రీజెన్‌ – 2025 రీజనరేటివ్‌ మెడిసన్‌ సదస్సు శనివారం ప్రారంభమైంది. మూడు రోజుల ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 500 మందికి పైగా వైద్య ప్రతినిధులు హాజరయ్యారు. పునరుత్పత్తి వైద్యంలో అత్యాధునిక పురోగతిని చాటే విధంగా,, కొత్త పీఆర్‌పీ మార్గదర్శకాలు, ప్లేట్‌ లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరఫి సురక్షితం సిద్ధం చేసిన కర దీపికను రీజెన్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ షర్మిలా తుల్పులే, ప్రభుత్వ మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అనస్థీషియా విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ జికే కుమార్‌, ఆర్టో బయోలాజిక్స్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకుడు నితీన్‌, అపోలో ఆస్పత్రి సీనియర్‌ కన్సలెంట్‌ డాక్టర్‌ నవలాడి శంకర్‌ విడుదల చేశారు. – సాక్షి, చైన్నె

విచారణ ఖైదీ అనుమానాస్పద మృతి

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌

అన్నానగర్‌: తిరుప్పూర్‌ జిల్లాలోని ఉడుమలై ఫారెస్ట్‌ రిజర్వ్‌లోని కొండ తెగ నివాసి అయిన మారిముత్తును ఓ గోల్డ్‌ ఫిష్‌ కలిగి ఉన్నారనే ఆరోపణపై అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుప్పూర్‌ జిల్లాలోని ఉడుమలై అటవీ శాఖ కార్యాలయంలో అతడిని విచారించారు. ఈ పరిస్థితిలో రెండు రోజుల క్రితం మారిముత్తు అనుమానాస్పదంగా మరణించాడు. దీంతో షాక్‌ అయిన అతని కుటుంబ సభ్యులు, కొండప్రాంత ప్రజలు సరైన దర్యాప్తు కోరుతూ నిరసన చేపట్టారు. ఈ పరిస్థితిలో మానుపట్టి అటవీ తిరుపూర్‌ జిల్లా అటవీ అధికారి రాజేష్‌ కుమార్‌ ఇద్దరు వ్యక్తులను, అంటే నిమల్‌ అనే ఫారెస్ట్‌ గార్డు సెంథిల్‌ కుమార్‌ను తొలగించాలని ఆదేశించారు. ఇంతలో మారిముత్తు మృతి నేపథ్యంలో ఉడుమలై, కుట్టైదిడల్‌ రోడులో సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. శుక్రవారం రాత్రి, తిరుప్పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తయింది. మారిముత్తు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉడుమలైకి తీసుకువచ్చారు. కుట్టై దిడల్‌ వద్ద గుమిగూడిన కొండప్రాంత ప్రజలు మారిముత్తు అంత్యక్రియల్లో భారీగా పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement