
విజేతలకు ఘన స్వాగతం
సేలం: స్పెషల్ ఒలింపిక్స్ ఇండియాలో భాగంగా ఛత్తీస్గఢ్లో మానసిక వికలాంగుల కోసం నిర్వహించిన బీఓసీసీఈ క్రీడా పోటీలో తమిళనాడు విద్యార్థులు పాల్గొని 8 పతకాలు సాధించారు. సేలం, చైన్నె, తిరుప్పూర్, మధురై, తిరునెల్వేలి జిల్లాల నుండి ఎనిమిది మంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఇందులో విజయం సాధించి తిరిగి వచ్చిన తమిళనాడు జట్టుకు సేలం రైల్వే స్టేషన్లో స్పెషల్ ఒలింపిక్స్ ఇండియా తమిళనాడు, సేలం అధికారులు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి ఆనందన్ మరియు అనేక మంది నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.