కాపర్ వైరు దొంగల అరెస్ట్
న్యూస్రీల్
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీచేస్తున్న దొంగలను చివ్వెంల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
పరిశ్రమలో పేలుడు
చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని
బృందావన్ లేబొరేటరీస్ పరిశ్రమలో
శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలింది.
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
- 10లో
ఐదింట నాలుగు మున్సిపాలిటీలు ‘హస్త’గతం
సూర్యాపేట టౌన్, భానుపురి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఐదు మున్సిపాలిటీలకు గాను కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. తిరుమలగిరి మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ పార్టీ కై వసం చేసుకుంది. బీజేపీ మాత్రం సూర్యాపేటలో ఒకేఒక్క వార్డులో గెలుపొంది ఇతర మున్సిపాలిటీల్లో తమ ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేసి సత్తాచాటారు.
అంచనాలు తలకిందులు..
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా హుజూర్నగర్, కోదాడలో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. నేరేడుచర్లలో కాస్త గట్టిపోటీనే ఇచ్చింది. అయితే సూర్యాపేటలో బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే జగదీష్రెడ్డి తన రాజకీయ చాణిక్యంతో అధిక స్థానాలు గెలుస్తారని అంతా భావించినా అంచనాలు తలకిందులయ్యాయి. ఇక్కడ 48 వార్డులకు 11 చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ ఏకపక్షంగా పది స్థానాలు గెలిచి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంది.
కనిపించని బీజేపీ ప్రభావం
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. గతంలో సూర్యాపేట మున్సిపాలిటీలో ఏడెనిమిది స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ ఈ సారికి కేవలం ఒకేఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. నాలుగు మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా ఖాతా తెరవకపోగా రెండో స్థానంలోనూ నిలువలేకపోయింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ పోటీ ఇవ్వలేకపోయింది.
సత్తాచాటిన స్వతంత్రులు
ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తాచాటారు. హుజూర్నగర్లో ముగ్గురు, కోదాడలో ఆరుగురు, సూర్యాపేటలో ఐదుగురు చొప్పున స్వతంత్ర అభ్యర్థులు పార్టీలను కాదని తమ సొంత చరిష్మాతో గెలుపొందారు. వీరిలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులే ఉన్నారు. అయితే కోదాడ, సూర్యాపేటలో హస్తం పార్టీలకు చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి పూర్తి మెజార్టీ ఉంది. వీరే కాకుండా జనసేన పార్టీ నేరేడుచర్లలో ఒక స్థానాన్ని, హుజూర్నగర్ మున్సిపాలిటీలో సీపీఎం, సీపీఐ చెరొక స్థానాన్ని గెలుపొంది తమ ఉనికిని చాటుకున్నాయి.
ఫ ఒక్క తిరుమలగిరి మున్సిపాలిటీలోనే
ఎగిరిన గులాబీ జెండా
ఫ జిల్లాలో ఒకేఒక్క వార్డు గెలిచిన బీజేపీ
ఫ సూర్యాపేట, కోదాడలో స్వతంత్ర
అభ్యర్థుల జయకేతనం
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్
కాపర్ వైరు దొంగల అరెస్ట్


