నాలుగు చోట్ల కాంగ్రెస్దే పైచేయి..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకు గాను కోదాడలో 3, హుజూర్నగర్లో ఒక వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 137 వార్డులకు ఎన్నికలు జరిగాయి. హుజుర్నగర్లో 28 వార్డులకు గాను 19 వార్డులను హస్తగతం చేసుకుంది. ఇక నేరేడుచర్లలో 15 వార్డులకు తొమ్మిది చోట్ల, తిరుమలగిరిలో 15 స్థానాలకు ఐదు చోట్ల, కోదాడలో 35 స్థానాలకు 26 వార్డులు, సూర్యాపేటలో 48 వార్డులకు 31 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. తిరుమలగిరి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలుచుకుంది.


