సామాజిక న్యాయ దినోత్సవం
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారన్నీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యా యం సాధించడానికి మహనీయుల ఆశయాలు, సిద్ధాంతాలే మార్గదర్శకాలన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమానత్వం సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో ఉపయుక్తమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీఓ శిరీష, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి నరసింహ, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, డీటీడీఓ శంకర్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్రెడ్డితో పాటు పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు


