
బ్రాహ్మణ సదన్ను ప్రారంభిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీష్రెడ్డి
చివ్వెంల(సూర్యాపేట): రాష్ట్ర అభివృద్ధిలో బ్రాహ్మణులు భాగస్వామలు కావాలని అటవీ, దేవా దాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరా రు. చివ్వెంల మండలం పరిధిలోని దురాజ్పల్లిలో రూ.2.50కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదన్ను ఆదివారం విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల గౌరవ వేతనాలు పెంచడం బ్రాహ్మణుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో నంబర్వన్ స్థానంలో ఉందన్నారు. బ్రాహ్మణ సదన్ నిర్మించడం దేశంలోనే గోపనపల్లి తర్వాత సూర్యాపేటలోనే అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వేణుగోపాలాచారి, సీఎం చీఫ్ పీఆర్ఓ జ్వాలా నర్సింహారావు, కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి