ఆగ్రహించిన ‘అమ్మ’ భక్తులు

Odisha Barampuram Village People Punish Two Men Goat Missing - Sakshi

గ్రామదేవతకు బలి ఇచ్చేందుకు తెచ్చిన మేక మాయం 

నిందితులను స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు 

ఒడిశా,బరంపురం: గంజాం జిల్లాలోని బెల్లిగుంటా సమితి పరిధిలో ఉన్న గుంటరిబడి గ్రామదేవత అమ్మవారికి బలి ఇచ్చేందుకు గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఓ మేకను కొనుగోలు చేశారు. దానిని గ్రామంలోని ఓ పశువుల శాలలో కట్టి ఉంచారు. అయితే ఇదే గ్రామానికి చెందిన సంతు తరణి, సిమ్మ బిశాయి అనే ఇద్దరు యువకులు మేకను ఎత్తుకుపోయి, ఓ మాంసం దుకాణానికి అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఆ ఇద్దరు యువకులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గ్రామంలోని ఓ స్తంభానికి కట్టి, చీవాట్లు పెట్టారు. ప్రస్తుతం ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుల దొంగతనంపై దర్యాప్తు చేపడుతున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top