●మల్లన్నకు పొందూరు తలపాగా
పొందూరు: శివరాత్రి సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామికి తలపాగా, ఇతర వస్త్రాలు పొందూరు నుంచి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది పొందూరు చేనేత వాడకు చెందిన బల్ల బద్రయ్య తీసుకుని వెళ్లారు. ఆదివారం శివరాత్రి రోజున రాత్రి ఈ వస్త్రాలను సమర్పించనున్నారు. శివయ్యకు తలపాగా, అమ్మవారికి చీర, శనగల బసవన్న, వినాయకుడికి పంచె, నవనందులను గాలి గోపురాన్ని అలంకరించేందుకు వస్త్రాలను నేశారు. మల్లికార్జున స్వామికి 366 మూరల పొడవు, 48 సెంటీ మీటర్లు వెడల్పు ఉన్న తలపాగా, భ్రమరాంబ అమ్మవారికి 6 మీటర్ల పసుపు అంచుచీర, శనగల బసవన్నకు 6 మీటర్ల అరుణవర్ణ అంచెపంచె, వినాయకుడికి 6 మీటర్లు ఎరుపు అంచు పంచెలను నేశారు. ఇక్కడి వాండ్రంగి వీధికి చెందిన ఆకాశం ముఖలింగం 33 సార్లు శ్రీశైలం వెళ్లి మల్లన్నకు వస్త్రాలను సమర్పించారు. లావేటి వీధికి చెందిన బూడిద చిన్నారావు 21 సార్లు స్వామికి వస్త్రాలను సమర్పించారు.


