●మహేంద్రజాలం | - | Sakshi
Sakshi News home page

●మహేంద్రజాలం

Feb 15 2026 6:46 AM | Updated on Feb 15 2026 6:46 AM

●మహేంద్రజాలం

●మహేంద్రజాలం

●మహేంద్రజాలం

మందస/ఇచ్ఛాపురం రూరల్‌: మహా శివరాత్రి సందర్భంగా తూర్పు కనుమల్లో ప్రశస్త్యమైన మహేంద్ర గిరులు భక్తులతో కనువిందు చేస్తున్నాయి. రాత్రంతా వెలిగే దీపాల వెలుగులు, మంత్రోచ్ఛరణలు ఆ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చుదిద్దుతున్నాయి. పాదయాత్రగా కొండను అధిరోహిస్తారు. ఈ కనుమలు గంజాం జిల్లా ఒడిశా–ఆంధ్రా సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. మందస గ్రామానికి సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. కుంతీదేవి, ధర్మరాజు ఆలయం, భీముడు, అర్జునుడి ఆలయం, పరశురాముడి విగ్రహాల సందర్శన ఓ ప్రత్యేక అనుభూతి. పాండవులు లింగ ప్రతిష్ట అనంతరం వారు ఈ మార్గం గుండా వెళ్లారని పురాణ కథనం. మందస నుంచే కాకుండా పర్లాకిమిడి నుంచి కూడా భక్తులు వెళ్తారు. బరంపురం, చీకటి ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులు జరడా మీదుగా వెళ్లేందుకు రోడ్డు సదుపాయం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement