విస్తృతంగా ఎకై ్సజ్ దాడులు
పాతపట్నం: ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్స జ్ అధికారులు రెండో రోజు శనివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. టెక్కలి, పలాస, మెళియాపుట్టి మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా రాష్ట్రం గారబంద పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామాలైన గోట్టయి, రామచంద్రాపూర్లు, కాశీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శిరడా తదితర పరిసరాల్లో 1,070 లీటర్ల నాటుసారా, 14,100 లీటర్ల బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే భారీగా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. సారా తయారీ, విక్రయాలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, పి.మురళీ, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరిటెండెంట్ రామచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.


