సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, నేరేడిగూడ తదితర చోట్ల 560 లీటర్ల సారా, 7,200 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్(ఎన్డీపీఎల్) ఒక్కటి తీసుకొస్తున్నా అరెస్టు చేసి కేసు నమోదు చేస్తామన్నారు. సారా తయారీ, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న పండగల దృష్ట్యా దాడులు విస్తృతం చేశామన్నారు. దాడుల్లో శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, పి.మురళీ, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్లు రామచంద్ర కుమార్, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్కుమార్ సాహూ, జిల్లా టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, పాతపట్నం, కొత్తూరు, ఆమదాలవలస ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


