జాతీయ బాక్సింగ్‌ పోటీలకు విశ్వేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు విశ్వేశ్వరరావు

Jan 2 2026 12:26 PM | Updated on Jan 2 2026 12:26 PM

జాతీయ

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు విశ్వేశ్వరరావు

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు విశ్వేశ్వరరావు

శ్రీకాకుళం న్యూకాలనీ : జాతీయ బాక్సింగ్‌ పోటీల కు జిల్లాకు చెందిన బాక్సర్‌ పి.విశ్వేశ్వరరావు ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వేదికగా ఈ నెల 4 నుంచి 10 వరకు తొమ్మిదో ఆలిండియా ఎలైట్‌మెన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం విశ్వేశ్వరరావు గురువారం ఇక్కడి నుంచి పయనమైవెళ్లాడు. ఇటీవ ల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంతో జా తీయ పోటీలకు ఎంపికయ్యాడు. డీఎస్‌ఏ బాక్సింగ్‌ కోచ్‌ ఎం.ఉమామహేశ్వరరావు నేతృత్వంలో కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయికి చేరుకోవడం అభినందనీయమని డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు సంతో షం వ్యక్తం చేశారు. జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ బీఏ లక్ష్మణ్‌దేవ్‌, వంగా మహేష్‌ ప్రోత్సా హం, శిక్షకుల చొరవ ప్రసంశనీయమని సీనియర్‌ బాక్సర్లు రాజీవ్‌, అప్పలరాజు, రాము, మనోజ్‌కుమార్‌ తదితరులు పేర్కొన్నారు.

విశాఖ రేంజ్‌ ఐజీగా గోపీనాథ్‌ జట్టి బాధ్యతల స్వీకరణ

విశాఖసిటీ: విశాఖ రేంజ్‌ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్‌ జట్టి పదోన్నతి పొందారు. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్‌ అధికారులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఐజీ ఆకాంక్షించారు. రేంజ్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డి (శ్రీకాకుళం) మర్యాదపూర్వకంగా కలిశారు. రేంజ్‌ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్న తాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్‌ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న గోపీనాథ్‌ జట్టి

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు విశ్వేశ్వరరావు   1
1/1

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు విశ్వేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement