ఉత్తమ ప్రతిభ కనబరచాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ప్రతిభ కనబరచాలి

Nov 3 2025 6:18 AM | Updated on Nov 3 2025 6:18 AM

ఉత్తమ ప్రతిభ కనబరచాలి

ఉత్తమ ప్రతిభ కనబరచాలి

ఎచ్చెర్ల : క్రీడల్లో మరింతగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్టీయూకేటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేవీజీడీ బాలాజీ ఆకాంక్షించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌.జి.ఎఫ్‌ సెలక్షన్‌లో పాల్గొని ఎంపికై ఈ నెల 3 నుంచి 6 వరకూ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్‌.జి.ఎఫ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో అండర్‌–19 శ్రీకాకుళం జిల్లా జట్టు తరఫున ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సాయిగణేష్‌ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని డైరెక్టర్‌ ఆదివారం అభినందించారు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, డీన్‌ డాక్టర్‌ శివరామకృష్ణ, ఫైనాన్స్‌ అధికారి డాక్టర్‌ వాసు, వెల్ఫేర్‌ డీన్‌ డాక్టర్‌ గేదెల రవి, ఇన్‌చార్జి సాగర్‌, టి.దిలీప్‌కుమార్‌, కృష్ణంరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement