రైతులకు పరిహారం ఇప్పించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

రైతులకు పరిహారం ఇప్పించాలని వినతి

Oct 16 2025 6:18 AM | Updated on Oct 16 2025 6:18 AM

రైతులకు పరిహారం ఇప్పించాలని వినతి

రైతులకు పరిహారం ఇప్పించాలని వినతి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలులు, వరదలకు పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 5250 ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని, ఆ పంటలకు ప్రభుత్వం తరఫున పరిహారం ఇప్పటించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement