సత్తాచాటిన సత్యవరం విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన సత్యవరం విద్యార్థులు

Sep 20 2025 6:44 AM | Updated on Sep 20 2025 6:44 AM

సత్తాచాటిన సత్యవరం విద్యార్థులు

సత్తాచాటిన సత్యవరం విద్యార్థులు

నరసన్నపేట:

త్యవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగిన గట్కా పోటీ(యుద్ధ విద్య ) లో సత్తా చాటారు. 23 మంది విద్యార్థులు హాజరుకాగా, 8 మంది స్వర్ణ పతకాలు, 12 మందికి రజత పతకాలు, మరో ముగ్గురికి కాంస్య పథకాలు వచ్చాయని హెచ్‌ఎం వకులా రత్నమాల తెలిపారు. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారని చెప్పారు. విజయవాడలోని ఆంధ్రా లయాలా కళాశాల్లో ఈ నెల 13, 14 తేదీల్లో ఈ పోటీలు జరిగాయన్నారు. వీరిని శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళి, ఎంఈఓ దాలినాయుడు, విద్యా కమిటీ చైర్మన్‌ శాంతా నాగరాజులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement