భవిష్యత్‌కు గ్యారెంటీ | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌కు గ్యారెంటీ

May 5 2025 8:32 AM | Updated on May 5 2025 11:39 AM

భవిష్

భవిష్యత్‌కు గ్యారెంటీ

● ట్రిపుల్‌ ఐటీ..

ఆర్‌జీయూకేటీ ప్రాంగణం

ఎచ్చెర్ల క్యాంపస్‌:

ట్రిపుల్‌ ఐటీ సందడి మొదలైంది. పదో తరగతి తర్వాత అధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఈ సంస్థలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రత్యేక వెయిటే జీ ఇవ్వడమే దీనికి కారణం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. ట్రిపుల్‌ ఐటీలో చేరితే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్ముతున్నారు.

రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్‌ ఐటీలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ప్రకాశం. శ్రీకాకుళం విద్యా సంస్థలో 1100 సీట్లు ఉన్నాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నా రు. ట్రిపుల్‌ ఐటీలో సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సు ఆరేళ్లు. రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు), నాలుగేళ్లు ఇంజినీరింగ్‌. పీయూసీ పూర్తయిన విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరుతారు. నూతన విద్యా విధానం–2020 మేరకు పీయూసీ పూర్తిచేసిన విద్యార్థులు రిలీవ్‌ కావచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు సైతం ఏటా రిలీవ్‌ కావచ్చు. విద్యార్హత బట్టి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజినీరింగ్‌లో సివి ల్‌, మెకానికల్‌, ట్రిపుల్‌ఈ, సీఎస్‌ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నారు. రిలీవ్‌ అయ్యే విద్యార్థులు ప్లేస్‌మెంట్‌లు సాధించటంతో పాటు గేట్‌ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు.

రెసిడెన్షియల్‌ పద్ధతిలో..

పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అర్హులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తారు. పీయూసీకీ రూ.45 వేలు, ఇంజినీరింగ్‌కు రూ.50 వేలు ఏడాదికి ట్యూషన్‌ ఫీజు. ఇతర తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రవేశం పొందితే రూ. 1.50 లక్షలు ఏడాదికి ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ మేరకు ఆంధ్రా విశ్వావిద్యాలయం పరిధిలో 17 జిల్లాలకు 65.62 శాతం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో 9 జిల్లాలకు 34.38 శాతం సీట్లు కేటాయించి ప్రవేశాలు నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఈ నెల 20 చివరి తేదీ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రవేశాల్లో వెయిటేజ్‌

ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సు

చదివే అవకాశం

రెసిడెన్షియల్‌ విధానంలో విద్య

మంచి ప్లేస్‌మెంట్లు సాధిస్తున్న రిలీవైన విద్యార్థులు

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఆర్‌జీయూకేటీలో ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తాం. మంచి భవిష్యత్‌ ఉంటుంది. రిలీవ్‌ నాటికి మంచి ప్లేస్‌మెంట్‌లు లభిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువగా ప్రవేశాలు లభిస్తున్నాయి. విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. పూర్వపు విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆన్‌లైన్‌లో గడువు లోగా దరఖాస్తులు చేసుకోవాలి.

– ప్రొఫెసర్‌ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ, శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌

దరఖాస్తుల స్వీకరణ..

2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఏప్రిల్‌ 27 వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 20 చివరి తేదీ. జూన్‌ ఐదున ఎంపికై న విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ ప్రకటిస్తారు. 11 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 30 నుంచి క్లాస్‌వర్క్‌ ప్రారంభించి అకడమిక్‌ ఏడాది ప్రారంభిస్తారు. 10వ తర గతి మార్కులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెయిటేజీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దివ్యాంగులు, క్యాప్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, స్కౌట్‌, వంటి ప్రత్యేక కేటగిరీలకు న్యూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

భవిష్యత్‌కు గ్యారెంటీ 1
1/4

భవిష్యత్‌కు గ్యారెంటీ

భవిష్యత్‌కు గ్యారెంటీ 2
2/4

భవిష్యత్‌కు గ్యారెంటీ

భవిష్యత్‌కు గ్యారెంటీ 3
3/4

భవిష్యత్‌కు గ్యారెంటీ

భవిష్యత్‌కు గ్యారెంటీ 4
4/4

భవిష్యత్‌కు గ్యారెంటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement