
మెరిసేవన్నీ అక్షయ పాత్రలు కావు
శ్రీకాకుళం క్రైమ్ : చూసేందుకు కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తుంది.. దాన్ని తెచ్చిన వారి మాట లు వింటే అరచేతిలోనే స్వర్గం కనిపిస్తుంది. తీరా మోసపోయాక గానీ అర్థం కాదు మెరిసేవన్నీ అక్షయపాత్రలు కావని. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస సమీపంలో పురాతన అక్షయ పాత్ర, రైస్ పుల్లింగ్ అని నమ్మించి మోసం చేస్తున్న పది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అదన పు ఎస్పీ కేవీ రమణ, శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
అంతా రియల్ వ్యాపారులే..
విశాఖపట్నం మధురవాడకు చెందిన పచ్చితల రవిశంకర్(45), అతని స్నేహితుడు రుద్రరాజు వెంకటరంగరాజు (64), పెద గంట్యాడకు చెందిన కనకరాజు (40), నరసన్నపేట మండలం కిళ్లాంకు చెందిన నక్కిన రఘునాథ రావు (52), తిరుపతి జిల్లా చిన్న గొట్టికల్లు మండలం చట్టివారిపాలెంకు చెందిన గట్టెక్కుల మురళీకృష్ణ (59), హైదరాబాద్కు చెందిన గరిక శ్రీను (36), కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారానికి చెందిన కొండ శ్రీవెంకట నాగసత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు. కరోనా కాలంలో వ్యాపారం లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గం గురించి ఆలోచించారు. రవిశంకర్ 2016 లో రణస్థలం మండలం కొచ్చెర్లకు చెందిన పూని భద్రయ్య (33)తో కలసి రైస్పుల్లింగ్ చేశారు. అప్పట్లో వీరిలో ఒకరిపై కొత్తూరు పీఎస్ పరిధిలో కేసు కూడా నమోదైంది. ఆ కేసులో ఎస్ఐ సస్పెండయ్యారు కూడా. మళ్లీ అదే అక్షయ పాత్ర, రైస్ పు ల్లింగ్ చేస్తే బాగుంటుందని రవిశంకర్, భద్రయ్య తో చేతులు కలిపాడు. రవిశంకర్ మధ్యవర్తిత్వంలో పూని భద్రయ్య వద్ద ఉన్న అక్షయపాత్రను రూ.25 లక్షలకు రుద్రరాజు వెంకటరంగరాజు బేరం కుదుర్చుకుని రూ. 5 లక్షలు అడ్వాన్సు ఇచ్చేందుకు ఒ ప్పుకున్నారు. నిజానికి ఇది రూ.1600కు మించదు.
పట్టుబడ్డారిలా..
ఎల్ఎన్పేట బొర్రంపేటకు చెందిన కుప్పిలి భాస్కరరావు సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస సమీపంలో ప్లేస్ సెట్ చేయడంతో మూడు కారుల్లో ఈ నెల 29 మధ్యాహ్నం అంతా బయల్దేరి వెళ్లారు. రవిశంకర్ వద్ద భద్రయ్య సోదరుడు పూనిరాజు డ్రైవర్ కావడంతో అతనూ వెళ్లాడు. అప్పటికే సమాచారం అందుకున్న సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి సిబ్బందితో వెన్నెలవలస గ్రామం రిజర్వాయర్ సమీపానికి వెళ్లగా పాడుబడిన బంగ్లాలో వీరంతా చేరి క్ర య విక్రయాలు జరుపుతూ కనిపించడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డీఎస్పీ వి
అక్షయ పాత్ర, రైస్ పుల్లింగ్ పేరిట మోసాలకు పాల్పడిన ముఠా అరెస్టు
పది మందిని రిమాండ్కు
తరలించినట్లు అదనపు ఎస్పీ, డీఎస్పీలు వెల్లడి
వేకానంద పర్యవేక్షణలో ఆమదాలవలస సీఐ సత్యనారాయణ విచారణ చేపట్టారు. రూ. 25 లక్షలకు కొన్న అక్షయపాత్రను మరొకరికి రూ. 50 లక్షలకు అమ్మేందుకు సిద్ధమైనట్లు విచారణలో తేలింది.
మభ్యపెట్టి..
ఈ అక్షయ పాత్ర సాధారణమైనది కాదని, పిడుగు పడినా, హైవోల్టేజీ విద్యుత్ కాంతులకై నా, సెల్ఫోన్ ప్లాష్ పడినా పనిచేయదని, అత్యధిక వేడిమిని కా యదని, దాన్ని ఉంచేందుకు ఇన్సిలేటర్ అనే బా క్స్ను సైతం చూపించి మభ్యపెట్టడం వీరి నైజం. ఆ బాక్సు ఎంత వేడిమినైనా తట్టుకుంటుందని మాయమాటలు చెబుతారు.
ప్రతిభకు ప్రశంసలు..
మీడియా సమావేశం అనంతరం నిందితుల వద్ద నుంచి 3 కార్లు, రూ. 5 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. కేసును డీఎ స్పీ వివేకానంద పర్యవేక్షణలో చాకచక్యంగా ఛేదించిన ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, ఎస్ఐ హైమావతి, సిబ్బంది జనార్ధనరావు, తిరుపతిరా వు, గణపతిరావు, సత్యనారాయణ, లక్ష్మణరావు, నర్సింగరావు, సంతోషిలను అభినందించారు.