
‘ఖరీఫ్ సమీపిస్తున్నా సన్నద్ధత లేదు’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఖరీఫ్ సమీపించినా ఇంతవరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయలేదని, కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగ రం పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి వెంకట సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముందస్తు నైరుతి రు తుపవనాలు వచ్చినా ఇప్పటివరకు సిద్ధం చేయలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నా రు. పెట్టుబడి సాయం ఎలాగూ ఇవ్వలేదు, కనీసం ఎరువులు, విత్తనాలు ముందస్తు ప్రణాళికతో సమకూర్చకపోతే ఎలా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా ముందస్తుగానే ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేవన్నారు.