విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు | - | Sakshi
Sakshi News home page

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

Jun 7 2025 12:32 AM | Updated on Jun 7 2025 12:34 AM

బియ్యం ఇంటికే వచ్చేవి

గత ప్రభుత్వ కాలంలో అనేక పథకాలు గడప వద్దకే వచ్చేవి. బియ్యం, పింఛన్‌, వైద్యం ఇంటి వద్దనే అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రేషన్‌ విడిపించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. అలాగే 104 సేవలు అందడం లేదు. కూటమి ప్రభుత్వ కాలంలో ప్రజలకు మేలు కలగక పోగా తిరిగి కష్టనష్టాలు పెరుగుతున్నాయి. – పట్నాన శంకరరావు,

జగనన్న కాలనీ, గడ్డెయ్యపేట

వైద్యం అందడం లేదు

గత ప్రభుత్వ కాలంలో 104 వాహనాల ద్వారా సేవలు సక్రమంగా అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక 104 అంతంత మాత్రంగానే వస్తోంది. వైద్యులు ఉండడం లేదు. గతంలో అయితే వృద్ధులు, గర్భిణులకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందేవి. వైద్యులు ఇంటికి వచ్చి తనిఖీలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్యం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. – కొండాల దాలమ్మ, పెద్దలంబ

గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు రైతు చెంతకే వచ్చేవి. పెట్టుబడికి ఏటా రూ.13,500 వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆర్‌బీకేల పేరు మార్చడమే కాకుండా వాటిని రైతులకు దూరం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు మునుపటిలా ఉందడం లేదు.

– బొబ్బాది ఈశ్వరరావు, గోపాలపెంట, నరసన్నపేట

ఆగిపోయిన ‘గడప వద్దకే సేవలు’

రచ్చబండ వద్దకు చేరిన పింఛన్ల పంపిణీ

సర్టిఫికెట్లకు తప్పని ప్రదక్షిణలు

క్యూ కడితేనే రేషన్‌ సరుకులు

వైఎస్‌ జగన్‌ మార్క్‌ను చెరిపేయడానికి సర్కారు యత్నాలు

నరసన్నపేట:

సామాన్యుడి ఇంటి వద్దకే పాలన.. మెల్లగా గతమైపోతోంది. ఇప్పటికే రేషన్‌కు డిపోలకు పంపిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ను ఊరికి రానివ్వడం లేదు. సచివాలయాలను నిర్జీవం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలను కూడా రైతులకు దూరం చేస్తున్నారు. మళ్లీ పాతకాలంలాగా సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ, విత్తనాల కోసం పీఏసీఎస్‌ల వద్ద, సంక్షేమ పథకాల కోసం నాయకుల ఇంటి దగ్గర ప్రదక్షిణలు తప్పేలా లేవు.

వైఎస్‌ జగన్‌ మార్క్‌ గడపగడపకూ సేవ

వైఎస్‌ జగన్‌ హయాంలో తొట్టతొలిసారిగా సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేరువ చేశారు. రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఇంటి వద్దకే విత్తనాలు, ఎరువులు అందించారు. రేషన్‌ సరుకులు ఇంటింటికీ అందించేందుకు ఎండీయూ వాహనాలను అందుబాటులోకి తీసుకువ చ్చి వందలాది నిరుద్యోగులకు భృతి కల్పించారు. వీరి ద్వారా బియ్యం ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్డుదారులు అందరూ హాయిగా సరుకులు తీసుకొనేవారు. సచివాలయాల్లో వన్‌బీ, అండంగల్‌ వచ్చేవి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేవి. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరేది.

అంతా తారుమారు..

కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా తారుమారైంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న పథకాలను నిలిపి వేయడంతో పాత కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంటి వద్దకే సేవలు దేవుడెరుగు.. కార్యాలయల చుట్టూ తిరిగినా పనులు కాని పరిస్థితి నెలకొంది. వలంటీర్‌ వ్యవస్థకు మంగళం పాడారు. ఎండీయూ వాహనాలు నిలిపేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ పథకం ప్రశ్నార్థకంగా మారింది. సచివాలయాలను నిర్వీర్యం చేశారు. పింఛన్ల పంపిణీ ఇళ్లకు కాకుండా రచ్చ బండల వద్దకు చేరింది. రైతు భరోసా కేంద్రాల పేరు రైతు సేవా కేంద్రాలుగా మార్చి వీటిని రైతులకు దూరం చేసింది. విద్యార్ధులు సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

ఇదేం మద్దతుధాన్యం మద్దతు ధర పెంపుపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాగు ఖర్చులు రెండింతలయ్యాయి. –10లో

ఇంటి వద్దకు వచ్చిన రేషన్‌ ఇప్పుడు నాలుగు వీధులు దాటి డిపోకు వెళ్తే గానీ రావడం లేదు. తలుపు తట్టి ఇచ్చిన పింఛను రచ్చబండ వద్దకు వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. సచివాలయం సాయంతో క్షణాల్లో జరిగిన పనులకు.. ప్రదక్షిణల సంప్రదాయం మళ్లీ మొదలైంది. ‘పౌర సేవ తీసుకోవడం మీ హక్కు.. మీ ఇంటి వద్దనే సేవలు అందాలి’ అని వైఎస్‌ జగన్‌ సర్కారు నమ్మితే.. ‘నిరీక్షించడం.. అభ్యర్థించడం.. చుట్టూ తిరగడం’ సామాన్యుడి జన్మ హక్కు అంటూ క్యూలో ఉన్న జనాలను చూసి కూటమి సర్కారు నవ్వుతోంది. ప్రతి వ్యవస్థలోనూ వైఎస్‌ జగన్‌ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు స్పష్టంగా కనిపిస్తుండడంతో వాటిని చెరపడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

5 కిలోమీటర్లు నడవాల్సిందే..

బియ్యం మోసుకుంటూ వెళ్తున్న వారు పోలాకి మండలం, బెలమరపాలవలస పంచాయ తీ పరిధిలోని చిన్నకోడూరు గ్రామానికి చెందిన వారు. వీళ్లు రేషన్‌ తెచ్చుకోవాలంటే ఇరువైపులా దాదాపు ఐదు కిలోమీటర్లు నడవాలి. బెలమర గ్రామంలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి వానకు దొరికిపోయి.. వర్షం ఆగడంతో మళ్లీ ఇలా హడావుడిగా ఇంటి దారి పట్టారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ఇంటి వద్దనే సరుకులు తీసుకున్నప్పుడు ఈ కష్టం ఉండేది కాదని గుర్తుతెచ్చుకున్నారు. ఇదే పంచాయతీలోని చిన్నకోడూరు, జొన్నయ్యపేట, కిల్లిబుచ్చెన్నపేట, పాలవలస గ్రామాలకు చెందిన వారు స్థానిక సర్పంచ్‌ చింతు ప్రమీలను కలిసి సమస్య చెప్పుకున్నారు కూడా. – పోలాకి

విత్తనాలు, ఎరువులు  సక్రమంగా అందడం లేదు 1
1/8

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

విత్తనాలు, ఎరువులు  సక్రమంగా అందడం లేదు 2
2/8

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

విత్తనాలు, ఎరువులు  సక్రమంగా అందడం లేదు 3
3/8

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

విత్తనాలు, ఎరువులు  సక్రమంగా అందడం లేదు 4
4/8

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

విత్తనాలు, ఎరువులు  సక్రమంగా అందడం లేదు 5
5/8

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

విత్తనాలు, ఎరువులు  సక్రమంగా అందడం లేదు 6
6/8

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

విత్తనాలు, ఎరువులు  సక్రమంగా అందడం లేదు 7
7/8

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

విత్తనాలు, ఎరువులు  సక్రమంగా అందడం లేదు 8
8/8

విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement