9న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

9న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

Jun 7 2025 12:32 AM | Updated on Jun 7 2025 12:32 AM

9న జి

9న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలకు రంగం సిద్ధమైంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడామైదానంలో ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌–2025 పోటీల్లో పాల్గొనే జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు ఈనెల 9వ తేదీన జరగనున్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషు ల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా సోమ వారం 10 గంటల నుంచి ఈ ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 2007 జూలై 27వ తేదీ తర్వాత జన్మించినవారు మాత్రమే అర్హులని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను గుంటూరులో జరిగే రాష్ట్రఅథ్లెటిక్స్‌ పోటీలకు పంపిస్తామని వారు చెప్పా రు. మరిన్ని వివరాలకు 9346903771 నంబర్‌ను సంప్రదించాలని మధుసూదన్‌ కోరారు.

పచ్చటి భూమిని ధ్వంసం చేస్తారా..?

మందస: పర్యావరణ పరిరక్షణ అంటూ మొక్క లు పాతుతున్న ఎమ్మెల్యే ఎయిర్‌పోర్టు పేరుతో లక్షలాది మొక్కలను ఎలా తొలగిస్తారని ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసుదేవ్‌ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎటు చూసినా పచ్చగా ఉండే ఉద్దానంలో 1400 ఎకరాలు ఎయిర్‌పోర్టు కు అప్పగిస్తే బీడు భూమి మాత్ర మే మిగులుతుందని అన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు కార్యదర్శి జోగి అప్పారావు, ఉపాధ్యక్షులు లండ రామ స్వామి, హార్టికల్చర్‌ యూనివర్సిటీ బోర్డు మెంబర్‌ బత్తిన లక్ష్మణ్‌, పొట్టి ధర్మారావు, లోకనాథం, జోగి రాజు, రామకృష్ణ రైతులు పాల్గొన్నారు.

ఎస్సీ లబ్ధిదారుల గుండె గు‘బిల్లు’

ఇచ్ఛాపురం రూరల్‌: మండలంలోని బొడ్డబడ గ్రామంలో సుమారు పాతిక దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరికీ బాబూ జగ్జీవన్‌ జ్యోతి పథకం ద్వారా గత ప్రభుత్వ హయాం నుంచి ఉచిత విద్యుత్‌ సబ్సిడీ ఉండేది. అయితే రెండు రోజుల క్రితం వచ్చిన విద్యుత్‌ బిల్లులు చూసి దళితులు షాక్‌ తిన్నారు. 200 యూనిట్లు లోపు విద్యుత్‌ వినియోగిస్తే సబ్సిడీ ఇవ్వాల్సింది పోయి వేల రూపాయల్లో బిల్లులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. అదే గ్రామానికి చెందిన కల్యాణ గున్నయ్య డప్పు కళాకారుడికి ఏకంగా రూ.4278.16 బిల్లు రావడంతో కుప్పకూలిపోయాడు. గత నెల వరకు విద్యుత్‌ సబ్సిడీ పొందిన తమకు వేల సంఖ్యలో విద్యుత్‌ బిల్లు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మాదిరి ఈ గ్రామంలో పలువురు దళితులకు వేలల్లో విద్యుత్‌ బిల్లులు వచ్చినట్లు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

ఈదురుగాలులకు ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు

నరసన్నపేట: మండలంలో శుక్రవారం మధ్యాహ్నం వీచిన ఈదురుగాలులకు పది విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయాయి. కొత్తపాలవలస సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభాలన్నీ వంగిపోయాయి. అలాగే దేవాది వద్ద 133 కేవీ లైన్‌కు సంబంధించిన విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో మండలంలోని దేవాది విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక పక్క ఉక్కపోత, మ రోవైపు రాత్రి 8 గంటల వరకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించకపోవడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

9న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు 1
1/2

9న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

9న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు 2
2/2

9న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement